ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ శకం ముగిసిపోతుంది : రాజగోపాల్ రెడ్డి

-

కాలేశ్వరం కేసులో హరీశ్రావు జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా చేర్యాలలో మాట్లాడుతూ… రుణమాఫీ కోసం హరీశ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, జైలుకు వెళ్లిన తరువాత రాజీనామా చేసినా ఒక్కటే చేయకపోయినా ఒక్కటేనని అన్నారు.10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, కోర్టు ద్వారా దేశంలోనే ప్రతి ష్టాత్మక తీర్పు రాబోతుందని అన్నారు.6 నెలల్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు జైలుకు పోవడం ఖాయమని, కోర్టు ద్వారానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దవుతాయని అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత బీజేపీలోకి హరీశ్ పోతాడని,ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ శకం ముగిసిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మిగులుతారన్నారు. కవిత తిహార్ జైలుకు పోయినా ఏం మొఖం పెట్టుకుని బస్సు యాత్ర పేరుతో కేసీఆర్ తిరుగుతున్నారని మండిపడ్డారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి, 2026 లో డీ లిమిటేషన్ లో నియోజక వర్గాన్ని చేస్తామని ఆయన ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news