కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్ లకే ఉంది : సజ్జల రామకృష్ణ

-

చంద్రబాబు మనిషి జన్మ ఎత్తలేదు ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతీరోజూ అయన ప్రసంగంలో సగం జగన్ ను తిట్టడమే అని ,చంద్రబాబు తలలో చిప్ పాడైందన్నారు.

చంద్రబాబు హయాంలో పెన్షన్ కోసం వృద్దులు అనేక ఇబ్బందులు పడ్డారని ,ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బందులు తీసుకొచ్చారని విమర్శించారు. ఇంటివద్దకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నది చంద్రబాబే.. మళ్ళీ ఈరోజు అంటున్నది చంద్రబాబే.. అని సజ్జల అన్నారు.”మొన్నటివరకూ dbt ద్వారా పెన్షన్ ఇవ్వాలి అన్నారు. ఇప్పుడు వద్దు అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పని చేసుకొనివ్వకుండా మధ్యలో దూరి చెడగొడుతున్నారు అని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్ లకే ఉంది. జగన్ ది కుల ప్రస్తావన లేని రాజకీయం అని అన్నారు. తుని ఘటనలో ఎక్కువ కేసులు బుక్ అయ్యింది వైసిపి వాళ్ళ పైనే. తుని ఘటనలో పవన్ కి డౌట్స్ ఉంటే చిరంజీవిని అడగాలి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news