ఏపీలో BRS ఫ్లెక్సీలు.. ఖమ్మం సభకు ఆంధ్రా నాయకులు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతా గులాబీమయమైంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా భారత్‌ రాష్ట్రసమితి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, తదితర నగరాలు, పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీరామారావుల ఫొటోలు వీటిలో ఉన్నాయి.

మరోవైపు ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరగనున్న బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభకు పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు ఇతర నేతలు పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం ఆహ్వానించింది. బీఆర్​ఎస్​ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి రాష్ట్రశాఖ అధ్యక్ష నియామకం చంద్రశేఖర్‌దే. అధిష్ఠానం ఆహ్వానం మేరకు ఏపీ నేతలు ఖమ్మం జిల్లా సభకు ఏపీ నుంచి జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news