వివేకానంద రెడ్డిని చంపింది జగన్ కు తెలుసు : బి. టెక్ రవి

-

పులివెందుల వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై టిడిపి అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్ రెడ్డికి వాస్తవం తెలుసు కాబట్టే.. ఆనాడు చెట్టు విచారణ జరుపుతున్న అభిషేక్ మహంతి సెలవు పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు చేశారు. ఇప్పుడు సిబిఐ అధికారి సుధా సింగ్ కూడా ఇదే కారణంతోనే విచారణ నుంచి తొలగించారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ బీటెక్ రవి.

ఎర్ర గంగిరెడ్డి మరియు సునీల్ యాదవ్ వీరే హత్య చేసి ఉంటే నేరుగా.. జగన్ పేరు కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి పేరు కానీ రంగయ్య చెప్పి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా? అని తెలిపారు. ఈ విషయం రంగయ్య చెప్పే దానికి రెండు సంవత్సరాలు పట్టిందా? అని బీటెక్ రవి ఫైర్ అయ్యారు. వివేకానంద రెడ్డి ని చంపిన హంతకులు ఎవరో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తెలుసని ఆరోపణలు చేశారు. వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్యకు సంబంధించిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ బీటెక్ రవి మీడియాకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news