విజయసాయికి కరోనా.. బుద్ధా వెంకన్న సెటైర్..!

-

కరోనా సోకిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, హైదరాబాద్ లో చికిత్స పొందుతుండటంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. “అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా? విజయసాయి రెడ్డి గారు. ఓహో అల్లుడి పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బీసీ నాయకుడిని అవమానించారు కదా”

ఆపై, ‘మరి మీరు విశాఖ లో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి?అన్నట్టు ఇది కరోనా పాజిటివా?వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా?ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?’ అని సెటైర్లు వేశారు. కాగా, కరోనా బారిన పడిన విజయసాయి రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news