దూసుకువస్తున్న బురేవి..తమిళనాడు లో హైఅలెర్ట్ 

-

తమిళనాడుకి మరో తుపాను పొంచి ఉంది. బురేవి తుపాన్ దక్షిణ తమిళనాడు వైపు దూసుకు వెళుతోంది. తుఫాన్ ప్రభావం తో పంబన్ సముద్రతీరం ఉగ్ర రూపం రూపుదాల్చింది. ఈ తుఫాను ఈ రాత్రి కన్యాకుమారి పంబన్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు చెన్నై సహా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి మొదలైన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈ సహాయ చర్యల్లో 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. తుఫాను నేపథ్యంలో ఈ తూత్తుకుడి విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు రద్దు చేశారు.. ఇక ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా కనిపిస్తోంది చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. కడప రాజంపేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తున్న ట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news