గ్రేటర్ వార్: మొదలయిన ఓల్డ్ మలక్ పెట్ రీపోలింగ్

-

ఓల్డ్ మలక్ పేట డివిజన్ కు రి పోలింగ్ కొద్దిసేపటి క్రితం మొదలయింది. మొన్న డిసెంబర్ 1 పోలింగ్ న బ్యాలెట్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో రి పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసి నిర్ణయం. తీసుకుంది. సీపీఐ అభ్యర్థి గుర్తుగా కంకి కొడవలి గుర్తుకు బదులు సీపీఎంకు చెందిన సుత్తి కొడవలి గుర్తు ముర్రించడంతో ఈ ఎన్నికకు రీ పోలింగ్ అవసరం అయింది. ఇక దీనికి కారణం అయిన ఆర్వోను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఈ దివిజియన్ లో మొత్తం 54655 ఓట్లు ఉండగా అందులో పురుషులు 27889, మహిళలు 26763, ఇతరులు 3 మంది ఉన్న్నారు. ఈ డివిజన్ 26లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓల్డ్ మలక్ పేటలో రిపోలింగ్ సందర్భంగా డివిజన్ లో సెలవు ప్రకటించారు. అలానే డివిజన్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 

Read more RELATED
Recommended to you

Latest news