బిజినెస్ ఐడియా: బ్లాక్ రైస్ తో అదిరే లాభాలు…!

-

చాలా మంది వ్యాపారాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా…? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడండి ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.

ఈ వ్యాపారం చేయడానికి మీ దగ్గర కొంచెం భూమి ఉంటే సరిపోతుంది. నల్ల బియ్యాన్ని పండించి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బియ్యం ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలో పండుతుంది. బ్లాక్ రైస్ ని పండించడం వలన అద్భుతమైన లాభాలను పొందొచ్చు. ఈ మధ్య కాలం లో మన రాష్ట్రంలో కూడా నల్ల బియ్యాన్ని ఎక్కువ మంది రైతులు పండిస్తున్నారు.

కేజీ నల్ల బియ్యం ధర 200 రూపాయల వరకు ఉంటుంది. అంటే మామూలు బియ్యం తో పోల్చుకుంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. మామూలు బియ్యం లో కంటే దీనిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ధర కూడా ఎక్కువగా ఉంటుంది. మహా రాష్ట్రలోని నల్ల బియ్యాన్ని పండించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నల్ల బియ్యం విత్తనాలు ధర 200 నుంచి 250 వరకు ఉంటుంది వరి సాగు లాగే ఈ పంటను వేయాలి ఇలా ఈ బియ్యాన్ని పండించి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా రైతులు నల్ల బియ్యాని పండించి చక్కటి లాభాలని పొందొచ్చు. ఈ వరి హెక్టార్ కి 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది నల్ల బియ్యం సాగు చేస్తే మంచిగా లాభాలని రైతులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news