ఏపీ సచివాలయంలో 85 అదనపు పోస్టులకు కేబినెట్ ఆమోదం

-

సచివాలయంలో 85 అదనపు పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సచివాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పలువురు సచివాలయ ఉద్యోగులు. వేడుకల్లో పాల్గొన్నారు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ప్రభుత్వం 85 పోస్టులు సృష్టించారని.. సచివాలయంలో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయన్నారు.

గతంలో సచివాలయంలో పదోన్నతులు తక్కువగా వచ్చేవన్నారు. కానీ సీఎం జగన్ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. సీఎం జగన్ కు సచివాలయ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news