కాళేశ్వరంపై మరోసారి కాగ్ పరిశీలన.. ఈ నెల11 న రాష్ట్రానికి అధికారులు

-

కాళేశ్వరం ఎత్తిపోతలపై మరింత లోతుగా పరిశీలన చేయాలని కాగ్ నిర్ణయించింది. గతేడాదిన్నరగా కాగ్‌ పలు రకాల సమాచారం అడగటం, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం, నీటిపారుదల శాఖ అధికారులు వివరణ ఇవ్వడం, వాటిపై కొర్రీలు వేయడం జరిగింది. అయితే తాజాగా కాగ్‌ ఉన్నతాధికారే నేరుగా కాళేశ్వరం పనులను పరిశీలించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లోని అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ చక్రవర్తి 11వ తేదీన అన్నారం పంపుహౌస్‌, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌కు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌కు లేఖ రాశారు.

మూడోసారి కాళేశ్వరం పనుల పరిశీలనకు ఉన్నతస్థాయి అధికారి నేరుగా వస్తుండటం నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ కాగ్‌ అధికారులు రెండు వేర్వేరు లేఖలు రాశారు. డిజైన్ల నుంచి పనుల వరకు అన్ని రకాల సమాచారాన్ని కోరారు. డిజైన్లలో మార్పులు చేసి ఉంటే ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news