సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ఆహ్వానం పలుకుతారా ?

-

ఈనెల 8వ తేదీన తెలంగాణలోని వరంగల్ బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణ అధికార పార్టీకి మరియు బీజేపీకి విమర్శల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రధాని మోదీ తెలంగాణకు విచ్చేసిన సమయంలో సీఎం కేసీఆర్ ఆహ్వానం పలకడానికి వెళ్లకుండా.. ప్రభుత్వం తరపున మంత్రిని పంపించారు. అప్పట్లో సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాగా రెండు రోజుల్లో మళ్ళీ తెలంగాణకు ప్రధాని మోదీని ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ వెళుతారు లేదా అన్నది చర్చలో ఉంది. కాగా ఇప్పటికే బీజేపీ నుండి వరంగల్ సభకు రమ్మని కేసీఆర్ కు ఆహ్వానము వెళ్ళింది.

అయితే ఇప్పటి వరకు ఈ ఆహ్వానం పై ప్రభుత్వం నుండి వస్తున్నారని కానీ, రావడం లేదని కానీ సమాచారం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news