భానుడి ప్రతాపానికి కారు దగ్ధం

-

గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుండి విపరీతమైన ఎండ, ఉక్కబోత తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. తాజాగా ఈ ఎండ ప్రతాపానికి ఓ కారు పూర్తిగా కాలి బూడిద అయ్యింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణ శివారులో ఎండ వేడికి కారు కాలిపోయింది.

Two dead and three injured as car catches fire after hitting electricity  pole in Jaggampeta

జగిత్యాల మండలం చాల్ గల్ గ్రామానికి చెందిన సుర బక్కయ్య అనే వ్యక్తి తన కారులో కోరుట్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండ వేడికి ఒక్కసారిగా ఇంజన్ లో నుండి మంటలు వచ్చాయి. వెంటనే బక్కయ్య అప్రమత్తం అయ్యి, రోడ్డు పక్కనే తన కారును ఆపి దిగడంతో తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ తర్వాత అగ్నిమాప సిబ్బందికి సమాచారం తెలియచేశాడు బక్కయ్య. అయితే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా కాళీ బూడిదయ్యింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news