టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు.. కూతురి పెళ్ళే కారణం..!

-

కరోనా వ్యాప్తి నేపధ్యంలో వివాహ శుభకార్యాలను అతి తక్కువ మందితో చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసులు సైతం నమోదు చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుండా.. ఎక్కువ మంది బంధుమిత్రులతో ఘనంగా పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారు. తాజాగా తన కూతురు వివాహాన్ని భారీ జన సందోహం మధ్య జరిపించి అడ్డంగా బుక్కయ్యాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తన కూతురి వివాహాన్ని తన సొంతగ్రామమైన అమలాపురంలో జరిపించారు. అయితే ఈ వివాహవేడుకకు టీడీపీ ముఖ్య నేతలతో పాటూ కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు. కాగా, ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం వరుడు, వధువు కుటుంబాలకు చెందిన అతి కొద్దిమందితోనే పెళ్లిళ్లు జరిపించాలి. కానీ, ఈరన్న కూతురి పెళ్లి విషయంలో అలా జరగలేదు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించి కారణంగా ఆయనపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news