ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన 20 మందిపై కేసులు నమోదు

-

ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డిసిపి స్నేహ మేహ్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధులపై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు చేసామన్నారు. మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్న పలు సోషల్ మీడియా నిర్వాహకులను అరెస్టు చేశామని.. ఎమ్మెల్సీ కవితపై ఈ మధ్య ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని గుర్తించామన్నారు.

ఎమ్మెల్సీ కవితపై కించపరిచే విధంగా, అభ్యుస్, వల్గర్ గా ట్రోల్ చేశారని తెలిపారు. దీంతో పాటు మహిళలపై అత్యధికంగా ట్రోల్స్ జరుగుతున్నాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధులపై ట్రోల్స్ జరుగుతున్నాయన్నారు. టిఆర్పి, సబ్స్క్రయిబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని వివరించారు సైబర్ క్రైమ్ డిసిపి స్నేహ. ఎక్కువ మంది యువత ఈ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే 20 మంది పై కేసులు నమోదు చేసి.. 8 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news