ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళగా.. ఇవాళ రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.

అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతోను సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 17వ తేదీన ప్రధానితో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు వారాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ వరుస పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా పాలనాపరమైన అంశాలకు సంబంధించిన అధికారిక పర్యటనగా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news