రాష్ట్రానికి మరో కేంద్ర సర్కార్ అవార్డు.. మిషన్ భగీరథకు పురస్కారం

-

రాష్ట్రాన్ని మరో కేంద్ర అవార్డు వరించింది. ఇంటింటికి తాగు నీరు అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. గాంధీ జయంతి రోజున దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ అవార్డు అందిస్తారు.

మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల పరిశీలించిన కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించిన జల్‌జీవన్ మిషన్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నాణ్యమైన తాగునీరు ఒక్కొక్కరికి 100 లీటర్లు చొప్పున అందుతున్నట్టు గుర్తించింది. మిషన్ భగీరథ పథకం నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందనే నిర్ణయానికి వచ్చి అవార్డుకు ఎంపిక చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news