ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ జాబ్.. పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్త బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

డిఈఓ, రేడియో గ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనిలో మొత్తం 155 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టులు వివరాలని చూస్తే.. డేటా ఎంట్రీ ఆపరేటర్ (50), రేడియో గ్రాఫర్‌ (50), మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌ (20), పేషెంట్ మేనేజర్‌ (10), పేషెంట్‌ కోఆర్డినేటర్‌ (25) పోస్టులు వున్నాయి.

ఇక అర్హత వివరాలని చూస్తే.. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. 35 ఏళ్లు మించకూడదు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసుండాలి. అదే ఇతర పోస్టులకు అయితే సంబంధిత విభాగంలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కి అప్లై చెయ్యాలంటే అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌ 12వ తేదీ లోగా ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాల్సి వుంది. ఇక ఫీజు విషయానికి వస్తే.. జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ. 885 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి వుంది. ఇతరులు రూ. 531 చెల్లించాలి. పూర్తి వివరాలని https://www.becil.com/ లో చూసి అప్లై చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news