కేంద్రం సంచలన నిర్ణయం.. హరీశ్‌ రావుకు కీలక పదవి..!

-

ఐజీఎస్టీ పరిష్కారం కోసం కేంద్రం ఏడుగురు మంత్రుల బృందంతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావుకు కేంద్రం చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు.

telangana finance minister harish rao good news to govt employees
 

ఈ కమిటీ ఐజీఎస్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించడం, సంబంధిత అంశాలపై పని చేయనుంది. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు ఈ కమిటీలో స్థానం కల్పించేవారు. కానీ కేంద్రం తాజాగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news