సమంతపై చైతూ సంచలన వ్యాఖ్యలు..నాకు బోర్ కొట్టింది..!

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఏడాది కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతున్నారు.

వరుస హిట్లతో నాగ చైతన్య జోరుమీదున్నాడు. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన నాగచైతన్య… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ’ సినిమాతో మళ్లీ డీలా పడ్డారు. జులై నెల 22వ తేదీన రిలీజ్‌ అయిన ఈ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా సమంతతో విడాకులు ఇవ్వడంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేమిద్దరం విడాకుల గురించి ప్రకటించాం. మా మధ్య ఏం జరిగిందో చెప్పాం. మా గురించి చెప్పాలంటే అంతే.. కానీ అంతకుమించి మా మధ్య ఏదో జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. అవి చూసి నాకు బోర్‌ కొట్టింది. విసుగు వస్తోంది. సమంతప గౌరవం ఎప్పటికీ పోదు అంటూ చైతూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news