కడప లో చంద్రబాబు పై ఫైర్ అవుతున్న కిరాణాషాపు యజమానులు..!

-

ఏపీ గంజాయి రవణ ఏదేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఏపీలోనే కనబడుతున్నాయి. దీంతో ప్రభుత్వం భద్రత మీద విమర్శలు వస్తున్నాయి జగన్ సర్కార్ చేతులు ఎత్తేయడం వలన రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విరివిగా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయని రాజకీయ నేతలు అంటున్నారు అటు ప్రతిపక్ష నాయకులు సైతం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగళం యాత్రలోనూ గంజాయి డ్రగ్స్ పై విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కిరాణా షాపు లో గంజాయి దొరికిన విషయం తెలిసిందే దానిని గుర్తు చేస్తూ జగన్ పై విమర్శలు చేశారు. గంజాయి కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన పనిలేదని కిరాణా షాపుల్లోనూ సరసమైన ధరల్లో లభిస్తుందని అన్నారు. దీంతో కడప కిరాణా షాపు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కిరాణా సభలు మూసివేసిన నిరసన వ్యక్తం చేస్తారు కిరాణా షాపుల్లో సరసమైన ధరలో దొరుకుతుంది అన్న చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో తనకి గుణపాఠం చెప్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news