మంత్రిపై ఏకంగా కమిటీ వేసిన బాబు…!

-

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. ఆయన అవినీతిని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాస్త ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఏకంగా నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఆస్పరి కి చేరుకున్న టీడీపీ నిజ నిర్దారణ కమిటీ బృందం.. మంత్రి జయరాం కొనుగోలు చేసిన భూములను పరిశీలించనుంది.

ఇట్టినా కంపెనీ భూముల కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాంపై తీవ్ర విమర్శలు చేస్తుంది. కమిటీలో ఎమ్యెల్సి లు బీటీ నాయుడు,బి టెక్ రవి, మాజీ ఎమ్మెల్యే లు కోట్ల సుజాతమ్మ, ఈరన్న,ప్రభాకర్ చౌదరి, కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు సోనిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆస్పరి లో భారీగా పోలీసుల మోహరించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చాయి టీడీపీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news