చంద్రబాబుకి కోవర్టుల భయం…!

-

తెలుగు దేశం ఇప్పుడు పడే ఇబ్బంది ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రాజకీయంగా బలహీనంగా ఉన్న పార్టీకి నేతలు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. జగన్ విధానాలు నచ్చి పార్టీ మారే నేతలు ఎక్కువగా ఉన్నారు. పార్టీలో ఇప్పుడు అసంతృప్తి ఎక్కువగా ఉంది. ప్రధానంగా చంద్రబాబు విధానాల విషయంలో నేతలు చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబుకి కోవర్టుల భయం ఎక్కువగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో బాబు ఎవరిని నమ్మే పరిస్థితి లేదని సమాచారం.

ఇన్నాళ్ళు నమ్మకంగా ఉన్న నేతలు కొందరు ఇప్పుడు వైసీపీ మంత్రులతో సావాస౦ ఎక్కువగా చేస్తున్నారు. వారితో వ్యాపార సంబంధాలను కూడా పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనే విషయం అందరికి తెలిసిందే. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గారికి కూడా టీడీపీలో మంచి స్నేహితులు ఉన్నారు. దీనితో జగన్ ఆయన్ను కాస్త దూరం పెట్టారు అనే ప్రచారం కూడా మొన్నీ మధ్య జరిగింది. ఇక ఇప్పుడు చంద్రబాబు వ్యూహాలు అన్నీ కూడా జగన్ కి లైవ్ లో తెలుస్తున్నాయి.

పార్టీలో ఆయనకు నమ్మకంగా ఉన్న వాళ్ళు జగన్ కి సమాచారం చేరవేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న కొన్ని కొన్ని రాజకీయాలను జగన్ కి చెప్పడం తోనే ఆయన సామాజిక వర్గం లక్ష్యంగా విమర్శలు చేసారని అంటున్నారు. టీడీపీ మీద కొందరు నిఘా పెట్టారని, అందుకే జగన్ సమాచారం పక్కాగా అందుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. జగన్ ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. ఆయనకు ఇబ్బంది కూడా ఏమీ లేదు. దీనితో ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ వైపు ఆలోచనలు చేస్తున్నారు. దీనిని మంత్రులు జగన్ కూడా చాలా సమర్ధవంతంగా వాడుకుంటున్నారు. ఇక సుజనా చౌదరి విషయంలో కూడా జగన్ కి పక్కా సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news