నన్ను రెచ్చగొట్టిన వాళ్ళ పతనం ఖాయం – చంద్రబాబు

-

నేడు కర్నూలు జిల్లా టిడిపి ఆఫీసు వద్ద ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో వైసిపి కార్యకర్తలు, లాయర్లు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను రౌడీలకు రౌడీనని.. గుండాలకు గుండానని వ్యాఖ్యానించారు. టిడిపి కార్యకర్తలకు తాను కనుసైగా చేస్తే మీరు చిత్తుచిత్తు అవుతారని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తానన్నారు చంద్రబాబు. తనని రెచ్చగొట్టిన వాళ్ళ పతనం ఖాయమని హెచ్చరించారు. వైసిపి నేతలు అబద్ధాలు చెప్పుకోవడం మానుకోవాలని సూచించారు. సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ తనపైనే దాడి చేయాలనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news