బ్రేకింగ్ : పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

-

పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని పేర్కొన్నారు. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండని పిలుపునిచ్చారు చంద్రబాబు.

ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోందన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని.. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు రంగంలోకి దిగిందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్టు తో సమన్వయం చేసుకుని టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు టిడిపి అధినేత చంద్రబాబు

Read more RELATED
Recommended to you

Latest news