జగన్మోహన్ రెడ్డి పొట్ట అబద్ధాల పుట్ట : చంద్రబాబు

-

ముఖ్యమంత్రి జగన్ కు ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప రైతుల గోడు గురించి పట్టదు అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నదాతల కష్టాలు పట్టని ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించాలని అన్నారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలో చంద్రబాబు పర్యటించారు. ఆ మండలాల పరిధిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు.

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా వైసీపీ సర్కార్ చోద్యం చూస్తోందని చంద్రబాబు విమర్శించారు. తిమ్మాపూర్, నాదెండ్ల మండలాల్లో దెబ్బతిన్న పంటచేలు పరిశీలించి..  పంటనష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పంట పాడైందని.. ఈసారి పత్తి వేస్తే వర్షాలు దెబ్బతీశాయని చంద్రబాబు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షలు  పెట్టుబడి పెట్టి నష్టపోయామని వాపోయారు.

అకాల వర్షాలతో పంటలు కుళ్లిపోయాయని రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే క్షేత్రస్థాయిలో వారికి అండగా ఉండాల్సిన సీఎం.. తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్రపోతున్నారని విమర్శించారు. జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఆయన పొట్ట అబద్ధాల పుట్ట అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news