చంద్రబాబు ఇక ఆ డైలాగ్ మానేస్తే మంచిదేమో..?

-

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. కానీ ఎన్నికల ఫలితాన్ని జీర్ణించుకోవడానికి మాత్రం చంద్రబాబుకు ఈ ఐదు నెలల సమయం కూడా సరిపోయినట్టు కనిపించడం లేదు. ఆయన నిన్న మొన్నటివరకూ నేను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదు అనేవారు.

కొన్ని రోజులుగా మరో కొత్త డైలాగ్ వాడుతున్నారు.. ఈ అధికారం నీకు ఎవరిచ్చారు.. అంటూ జగన్ గురించి తరచూ ప్రెస్ మీట్లలో మండిపడుతున్నారు. ఇసుక కార్మికుల ఇబ్బందులు, అన్న క్యాంటీన్ల రద్దు , రైతు రుణమాఫీ విడతల సొమ్ము విడుదల చేయకపోవడం.. వంటి అంశాలపై చంద్రబాబు ప్రస్తావిస్తూ నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అంటూ గర్జిస్తున్నారు.

ఎన్నికల్లో దెబ్బ తిన్నా చంద్రబాబు మాత్రం నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. గంటల తరబడి పార్టీ సమీక్షలు.. ఆ తర్వాత గంటల తరబడి ప్రెస్ మీట్లూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ అధికారం నీకెవరిచ్చారు అని అడుగుతూనే ఉన్నారు. ఈ అధికారాన్ని జనమే ఆయన కట్టబెట్టారని ఆయనకు తెలియంది కాదు.

చివరకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబు మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎగతాళి చేశారు. అయినా చంద్రబాబు తీరు మాత్రం మారడం లేదు. ఏరోజైనా కేవలం ఓ గంటసేపట్లో ప్రెస్ మీట్ ముగించడం చాలా అరుదుగా చెప్పుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news