చంద్రబాబు నాయుడు: మాపై దాడులు చేస్తే… వడ్డీతో సహా చెల్లిస్తాం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్టిక్కర్ వార్ జరుగుతోంది. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రము అంతటా ప్రజాప్రతినిధులు నాయకులు అంతా జగనన్నే మా నమ్మకం మరియు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ వారి ఇంటి గోడమీద జగన్ స్టిక్కర్ లను అంటిస్తున్నారు. ఇంకా వైసీపీకి పోటీగా టీడీపీ మరియు జనసేనలు సైతం స్టిక్కర్ లు అంటిస్తుండడంతో కొన్ని చోట్ల నాయకుల మధ్యన చిన్న పాటి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపైన మాజీ సీఎం మరియు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల ఇళ్లపై ఎలా స్టిక్కర్లు అంటిస్తారని మండిపడ్డారు. సదరు యజమాని అనుమతి లేకుండా అంటిస్తే అది నేరమే అవుతుందన్నారు.

మా కార్యకర్తలపై దాడులు చేస్తే మేము దానికి వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా మొన్న ఎన్నికలలో కడపలో టీడీపీ జెండా ఎగురవేశామని, ఈసారి పులివేద్న్హులలోన్నూ మా జెండా ఎగురవేస్తామని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news