రూ.100 నాణెంపై NTR బొమ్మ..తెలుగువారందరికీ ఇది గర్వకారణం – చంద్రబాబు

-

విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందమూరి తారక రామారావు కు అరుదైన గౌరవం దక్కనుంది. నందమూరి తారకరామారావు చిత్రంతో రూ. 100 కాయిన్ ను త్వరలోనే ముద్రించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ. 100 కాయిన్ తయారు చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు మెంట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి కాయిన్ నమూన చూపించి సలహాలు కోరారు. దీంతో త్వరలోనే ఎన్టీ రామారావు కాయిన్ అందుబాటులోకి రానుంది. అయితే, దీనిపై నారా చంద్రబాబు స్పందించారు. రూ.100 వెండి నాణెం పై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకర విషయం. తెలుగువారందరికీ ఇది గర్వకారణం అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news