తెలంగాణలో మళ్లీ సైకిల్ జోరు…కేసీఆర్ కు షాక్ తప్పదా !

-

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాగ వేయాలని టీడీపీ చూస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో టీడీపీ పార్టీ వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఖమ్మంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయాలని తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, టిడిపి తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్ రావు పిలిపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… ఇవాళ ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యావత్ ఖమ్మంతో పాటు అన్ని జిల్లాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరుగుతుందని అని తెలిపారు.

 

ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం హైదరాబాదులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి మధ్యాహ్నానికి ఖమ్మం చేరుకుంటారు అన్నారు. ఈ మార్గమధ్యంలో అడుగడుగునా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తారు అని పేర్కోన్నారు. కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరగనుందని.. ఈ సభతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తథ్యం అని అన్నారు. ఖమ్మం సభకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని.. ఎన్టీఆర్, చంద్రబాబులు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని, బీసీలకు పెద్దపీట వేసింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news