సీఎం అయ్యాకే.. అసెంబ్లీకి వస్తా : చంద్రబాబు సంచలన నిర్ణయం

-

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏపీ కి ముఖ్యమంత్రి అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి వస్తానని కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. తన భార్య శీలాన్ని కూడా సంకించే విధంగా సభలో కామెంట్లు చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సభ లో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు చంద్రబాబు. తన పై వ్యక్తి గతంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్ర బాబు నాయుడు. కుప్పం ఫలితాల తరువాత కూడా సీఎం జగన్‌ నా మొహం చూడాలని అన్నారని గుర్తు చేశారు చంద్రబాబు. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఏ పరువు కోసమైతే.. తాను ఇన్నేళ్లు తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత… నారా చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news