పవర్ లో ఉన్నవారి కన్నా ప్రజా పవర్ శక్తివంతమైనది.. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్.

-

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఆనందాలు వెళ్లివిరిశాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత ఏడాది కాలం నుంచి రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు. తాజాగా ఈ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటాం అని మోదీ హామీ ఇచ్చారు. దీంతో దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నిర్ణయం పై స్పందిస్తున్నారు. తాజా మంత్రి కేటీఆర్ కూడా వ్యవసాయ చట్టాల రద్దుపైస్పందించారు.

ఇది అధికారంలో ఉన్న వారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని ఆయన పేర్కొన్నారు. ఇది మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘పవర్ ఉన్న వారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’ భారతీయ రైతులు దీనిని నిరంతర ఆందోళనతో తాము అనుకున్నది సాధించి దీనిని నిరూపించారు. జై జవాన్ జై కిసాన్’’ అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news