ఎన్నికల సంఘం అధికారులు.. గుమస్తాల్లా తయారయ్యారు : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘంలోని వారికి వారి ఉద్యోగాలే ముఖ్యమనీ.. ఎస్ఈసీ అధికారులు గుమాస్తాలు మాదిరి తయారయ్యారని ఫైర్ అయ్యారు. దేశ సమగ్రత కోసం పాటుపడే ఐఏఎస్సులు.. ఇప్పుడు నేరస్థుల సమగ్రత కోసం.. అవినీతి సమగ్రత కోసం పోరాడుతున్నారని నిప్పులు చెరిగారు చంద్ర బాబు.

వైసీపీకి, జగనుకు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదని.. సీఎంగానే కాదు.. రాజకీయాల్లో ఉండేందుకే అనర్హులుఅని చురకలు అంటించారు. కుప్పంలో అధికార పార్టీ చేస్తోన్న ఎన్నికల అక్రమాలు చూసి అక్కడి నేను వెళ్లాలనే ఆలోచన కల్పించారంటే ఎంత అరాచకం చేస్తున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. యువతను అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లేయిస్తారా..? యువతను నేరాల ఊబిలో చిక్కుకునేలా చేస్తారా..? అని నిలదీశారు.  కొందరు యువతే ఆ విధంగా దొంగ ఓట్లేస్తూ దొరికిపోయి.. మొహం దాచుకుంటే నాకే బాధేస్తోందని.. చక్కగా చదువుకున్న యువతీ యువకుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని మండి పడ్డారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news