చంద్రబాబు పర్యటన.. కుప్పంలో టెన్షన్ టెన్షన్..

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిపురం మండలంలో వందలాదిగా మోహరించిన పోలీసులు టిడిపి ప్రచార రథాన్ని, మరో వాహనాన్ని అడ్డుకొని వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ తరలించే క్రమంలో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. వారిని చుట్టూ ముట్టి పిడుగులు గుద్దారు. అడ్డుకునేందుకు పెట్టిన భారీ గేట్లను తీసి అవతల పడేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కేనుమాకూరి పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని టిడిపి నేతలు తలపెట్టగా.. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజిని పోలీసులు తొలగించారు. ఈ పర్యటన కోసం చంద్రబాబు మరి కాసేపట్లో పెద్దూరు గ్రామానికి చేరుకుంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news