చిల్లర రాజకీయాలు వద్దు : బాబు వార్నింగ్

-

విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా దర్గా లోకి వెళ్లి ప్రార్ధనలు నిర్వహించిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్ షో మొదలు పెట్టారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, కేశినేని శ్వేతలు హాజరయ్యారు. అయితే చంద్రబాబు ప్రచారానికి కేశినేని నాని దూరంగా ఉన్నారు. చంద్రబాబు సూచనలతో కేశినేని నాని ప్రచారానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక పార్టీ నేతలతో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టండి.. చిల్లర రాజకీయాలు వద్దని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మనం కలిసుంటేనే బలం.. లేకుంటే మనల్ని కొడతారని ఆయన అన్నారని అంటున్నారు. ఆ తర్వాత నేను ఏం చేయలేక ఓ దండం పెట్టాల్సి వస్తుందని అన్నారు. విజయవాడ మేయర్ గెలవకపోతే తలెత్తుకు తిరగలేరని ఆయన పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news