ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు బహిరంగ లేఖ

-

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కుప్పం సెగ్మెంట్ పరిధిలో గ్రానైట్ అక్రమ మైనింగ్.. ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో అక్రమ మైనిం గ్ పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను జత చేసి లేఖ రాశారు చంద్రబాబు.

గ్రానైట్ అక్రమ మైనింగ్ పై ఎన్జీటి ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చేయాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగును అడ్డుకోవాలని.. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించిందని పేర్కొన్నారు.

అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటీ ఆదేశించిందని లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగుపై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని పేర్కొన్నారు చంద్రబాబు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news