175 స్థానాలు గెలవడం కోసమే మార్పులు : సజ్జల

-

సీఎం జగన్  నాయకత్వంలో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజాగా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి వైసీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలోని భీమిలి నుంచి 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలిపారు. 

175 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. మల్లాది విష్ణుకు మరింత ఉన్నతమైన బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లాది చట్టసభల్లోకి వెళ్తారని తెలిపారు. మల్లాది విష్ణు సారధ్యంలోనే వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సజ్జల చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ అని విమర్శించారు. ఓడిపోయిన రెండు నెలలకే ఎన్నికలు అని హడావిడి మొదలు పెట్టాడని దుయ్యబట్టారు. బాబు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాడని.. అన్ని చోట్లా స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. విజయవాడను బాబు అభివృద్ధి చేయలేకపోయాడని.. జగన్ వచ్చాకే అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Latest news