సోష‌ల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన చార్మి.. ఎందుకో తెలుసా

-

ఒక‌ప్పుడు ఇండియాలో కొత్త‌గా కేసులు న‌మోద‌యిన‌ప్పుడు దానికి వెల్‌క‌మ్ చెప్పి ఆల్ దిబెస్ట్ చెప్పింది ఓ ముద్దుగుమ్మ‌. మ‌ర్చిపోయారా అమెనే నండి చార్మి. అప్పుడెప్పుడో వైర‌ల్ గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎలా అంటారా అయితే చూసేయండి.


ప్ర‌స్తుతం దేశంలో కరోనా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కేసులు.. వేలసంఖ్యలో మరణాలు న‌మోద‌వుతున్నాయి. ఇక ప్ర‌భుత్వాలు కూడా లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ పెడుతున్నా.. త‌గ్గుముఖం ప‌ట్ట‌ట్లేదు. మ‌రోవైపు సినిమాలు వ‌రుస‌గా వాయిదా ప‌డుతున్నాయి. కొన్ని షూటింగులు నిలిపి వేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట టైమ్ లో ఓ కామెంట్ చేసి మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది చార్మీ.
తాను సోషల్ మీడియా నుండి కొంతకాలం దూరంగా ఉండాలని అనుకుంటున్న‌ట్టు ప్రకటించింది. ఈ క్ర‌మంలో ఫేస్ బుక్ లో ఓ వీడియోన పోస్టు చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా ఉంద‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి అని చెబుతూ సోషల్ మీడియాకు బై చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది. తాను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. అంద‌రూ తమ కుటుంబాల‌ను క్షేమంగా చూసుకోవాల‌ని, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిబంధ‌న‌లు పాటించాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాన సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news