జబర్దస్త్ కి చెక్ పెడుతూ ఆహా కొత్త స్కెచ్..!

-

బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో గా జబర్దస్త్ మంచి పేరు సంపాదించుకుంది. ఇందులో ఎంతోమంది జడ్జిలు, కమెడియన్లు వచ్చారు.. వెళ్లిపోయారు. ఇప్పటికే ఇండస్ట్రీలో హాస్యనటులుగా నిలదొక్కుకున్న చాలామంది జబర్దస్త్ నుంచి వచ్చిన వారే.. అంతలా ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ కామెడీ షో. అయితే గతంలో జబర్దస్త్ కి పోటీగా జీ తెలుగులో అదిరింది.. మాటీవీలో కామెడీ స్టార్స్ వంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి. కానీ అవేవి నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. కానీ జబర్దస్త్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పుడు జబర్దస్త్ కి చెక్ పెడుతూ ఆహా కొత్త స్కెచ్ వేసింది. జబర్దస్త్ కి పోటీగా మరొక కామెడీ షో వస్తోంది. అయితే ఇది టీవీలో కాకుండా ఓటిటిలో ప్రసారం కాబోతోంది.

తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ఆహా “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” పేరుతో ఒక కామెడీ షో తీసుకొస్తోంది. ఈ షోకి సుడిగాలి సుదీర్ ,దీపికా పిళ్ళై హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మిగతా కామెడీ షోలతో పోల్చితే ఇది కొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇటీవలే “ప్రేక్షకులే ఇన్వెస్ట్మెంట్ కమెడియన్ స్టాక్స్ .. అనిల్ రావిపూడి చైర్మన్”.. అంటూ ఒక ప్రోమోని వదిలారు. ఇందులో అవినాష్ , వేణు, సద్దాం , యాదమ్మ రాజు, హరి భాస్కర్ , జ్ఞానేశ్వర్ టీం లీడర్స్ గా వ్యవహరించబోతున్నారు.

ఇక ఇందులో షో ముగిసిన తర్వాత జడ్జిలు మార్కులు ఇవ్వకుండా అక్కడున్న ప్రేక్షకులే ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఈ కామెడీ షో ఆహా లో ప్రసారం కానుంది. మరి ఏ రేంజ్ లో సక్సెస్ పొందుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news