రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో తనిఖీలు

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించిన హెలికాఫ్టర్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడుకు వెళ్లారు. రాహుల్ గాంధీ సోమవారం ఉదయం కర్ణాటకలోని మైసూరు నుంచి తమిళనాడులోని నీలగిరికి హెలికాప్టర్లో చేరుకున్నారు. నీలగిరిలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, రాహుల్ గాంధీ నీలగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఏ రాజా. తరపున ప్రచారం నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు.

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నీలగిరిలో ల్యాండ్ అయిన తరువాత ఆయన హెలికాప్టర్ ను కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఉదయనిధి స్టాలిన్ కూడా తమ పార్టీ అభ్యర్థి ఏ రాజా తరపున ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్లారు. రాహుల్ గాంధీ నీలగిరి నుంచి కేరళలోని వయనాడ్ కి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news