ఎమ్మెల్యే రోజాకు బిగ్ షాక్…ఆమె భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ !

-

నగరి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే.. ఆర్కే రోజాకు ఊహించని షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణి పై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. 2016 సంవత్సరంలో.. సెల్వమణి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు ఓ టీవీ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఫైనాన్షియర్‌ ముకుంద్‌ చంద్‌ బోద్రా పై తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో.. వీరిద్దరిపై బోద్రా జార్జిటౌన్‌ కోర్టు లో పరువు నష్టం దావా వేశారు. అయితే.. ఆ తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన కుమారుడు గగన్‌ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు.. వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ ను ఈ నెల 23 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఇక ఈ సంఘటన పై రోజా కుటుంబం ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news