చెన్నై పేల‌వ‌మైన బ్యాటింగ్‌.. రాజ‌స్థాన్ టార్గెట్ 126..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 37వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ చాలా త‌క్కువ స్కోరు చేసింది. ఆరంభం నుంచి చెన్నై జ‌ట్టు దూకుడుగా ఆడ‌లేక‌పోయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 125 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

chennai made 125 runs against rajasthan in ipl 2020 37th match

మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కేవ‌లం జ‌డేజా మాత్ర‌మే జ‌ట్టును ఆదుకునే య‌త్నం చేశాడు. 30 బంతులు ఆడిన జ‌డేజా 4 ఫోర్ల‌తో 35 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు.

రాజ‌స్థాన్ బౌల‌ర్లు చెన్నైపై ఆరంభం నుంచి ఒత్తిడి పెంచారు. ఏ ద‌శ‌లోనూ చెన్నై బ్యాట్స్‌మెన్‌కు అవ‌కాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో రాయ‌ల్స్ బౌల‌ర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేశారు. ఈ క్ర‌మంలో రాయ‌ల్స్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌, కార్తీక్ త్యాగి, ఎస్‌.గోపాల్‌, ఆర్‌.తెవాతియాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news