మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం..

-

మహారాష్ట్రలో ఖాతా తెరిచింది బీఆర్ఎస్ పార్టీ. మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబేలోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయితీ ఉప ఎన్నికల్లో 115 ఓట్లతో గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గఫూర్ పఠాన్.

దీంతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నాందేడ్ లో శిక్షణ తరగతులలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇక తిరిగి రేపు హైదరాబాద్ ప్రయాణం కానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఈ శిక్షణ తరగతులలో పార్టీని మహారాష్ట్రలో ఎలా ముందుకు తీసుకుపోవాలో.. నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news