అడ్వాన్స్ బుకింగ్ కోసం సిద్దంగా ఉన్న చిరు, బాలయ్య ఫ్యాన్స్..!!

-

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్న సంగతి తెలిసిందే.అయితే  దిల్ రాజు కు బడ్జెట్ మరియు థియేటర్స్ ప్రాబ్లెమ్ వల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు వంద కోట్ల బడ్జెట్ తో కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నాయి. కొద్దిగా టాక్ వస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది.

కాని వారసుడు కోసం దిల్ రాజు రూ.250 కోట్ల వరకు పెట్టారట .సంక్రాంతికి రాబోతున్న సినిమాల బడ్జెట్ పరంగా చూసుకుంటే తమిళంలో లో  హీరో అజిత్ తునివు సినిమా వల్ల, తెలుగు లో చిరు, బాలయ్య వల్ల వారసుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చిరంజీవి,బాలయ్య సినిమాలకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బాలయ్య బాబు సినిమా  వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న రిలీజ్ కానుండగా, మెగాస్టార్  సినిమా వాల్తేరు వీరయ్య జనవరి 13 కి రిలీజ్ కానుంది. ఈ చిత్రాలు ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ కానున్నాయి. అయితే ఓవర్సీస్ లో డిసెంబర్ 29, 2022 న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ డేట్ కూడా త్వరలో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంకా థియేటర్స్ కోసం ఫైనల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news