చిరంజీవి నోట వీరసింహారెడ్డి మాట.. మనస్ఫూర్తిగా అంటూ..!

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో చాలా గ్రాండ్ గా ఆదివారం అనగా జనవరి 8న నిర్వహించారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. చిరంజీవి మాటలు విని.. సినిమా గురించి చెప్పిన సంగతులు విని మెగా అభిమానులు హుషారెత్తిపోయారు. వైజాగ్ ఏయు గ్రౌండ్స్ లో భారీ జన సందోహం నడుమ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

వాల్తేరు వీరయ్య సినిమా బెస్ట్ ఔట్పుట్ కోసం యూనిట్ మొత్తం ఎంతలా కష్టపడిందో చెబుతూ చిన్నచిన్న లీక్స్ కూడా ఇచ్చారు మెగాస్టార్. అలాగే ప్రొడ్యూసర్స్ గురించి, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాపై కూడా తన ఒపీనియన్ తెలిపారు. ఇకపోతే ఇన్ని దశాబ్దాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకేరోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ చేస్తున్న ఘనత మైత్రి మూవీ మేకర్స్ కి దక్కుతుందని చిరంజీవి చెప్పడం గమనార్హం. ఈ సంక్రాంతికి రాబోతున్న వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలు రెండు కూడా పెద్ద హిట్ కావాలి అని ఈ వైజాగ్ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి తెలిపారు.

తన సినిమాను విడుదలకు సిద్ధం చేస్తే మరొక సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా చిరంజీవి కోరుకుంటుండడంతో ఆయన మంచి మనసుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు . ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కేథరిన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఒక రవితేజ.. చిరంజీవికి సోదరుడి పాత్రలో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news