కటాకటాలపాలైన నకిలీ అధికారి

-

ఓ వ్యక్తి ప్రభుత్వ అధికారిగా చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బానోత్ రమేష్(32) సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ ప్రభుత్వ అధికారి అవతారమెత్తాడు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేస్తూ ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, మీపై సస్పెన్షన్ ఆర్డర్ సిద్ధం అవుతోందని బెదిరింపులకు దిగేవాడు. అది నమ్మిన ఉద్యోగులు అతనికి డబ్బులు సమర్పించేవారు. రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు రమేష్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news