జూన్ 8నే షర్మిల కొత్త పార్టీ ప్రారంభం… క్లారిటీ ఇచ్చేశారుగా!

-

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి ముహుర్తం ఖరారయింది. వైఎస్సార్‌ జయంతి రోజున షర్మిల కొత్త పార్టీ ప్రకటించనున్నారు. వైఎస్సార్‌ టీపీగా ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పూర్తి అయింది. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని విజయమ్మ కూడా లేఖ రాశారు. ఈ లేఖను ఈసీకి షర్మిల సమర్పించారు. ఈసీ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దీంతో పార్టీ ప్రకటనపై లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల కార్యాలయం నుంచి స్పష్టత వచ్చింది. పత్రికా ప్రకటన విడుదల చేశారు.

పత్రికా ప్రకటన ఇలా ఉంది:

దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణాలో మళ్ళీ తీసుకురావడం కోసం వైఎస్ షర్మిల “YSR తెలంగాణ” పార్టీ పెట్టాలనుకుంది మీ అందరికి తెలిసిందే.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వద్ద పూర్తైంది. పార్టీ పేరుపై వైఎస్ విజయమ్మగారికి ఎటువంటి అభ్యంతరం లేదని వారు ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వడం జరిగింది.

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా  “వైఎస్సార్ తెలంగాణ” పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ‌లో భాగంగా వారి అఫిషియల్ వెబ్ సైట్‌లో పార్టీ పేరు‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30నే ఎలెక్షన్ కమిషన్ తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రాసెస్ పూర్తైందని అనుకుంటున్నాం.

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా నుంచి అఫిషియల్‌గా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరు ఖరారు వైఎస్ విజయమ్మ ఆశీస్సులతో జరిగింది. కాబట్టి ఇతరులకు అభ్యంతరం ఉంటుందని అనుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించాం.’’ అని షర్మిల లోటస్ పాండ్ వర్గం స్పష్టత ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news