నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్ ఇదే

-

ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌..ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు.

ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు సీఎం జగన్. 10.50 – 12.35 బహిరంగ సభలో వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.. మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news