సీఎం జగన్ గుడ్ న్యూస్… వాలంటీర్లకు నగదు బహుమతులు !

-

ఏపీలో సీఎం జగన్ తమ మార్క్ పాలనను కొనసాగిస్తున్నాడు. అస్సలు తన పాలనపై ప్రజల్లో ఇంతటి పోజిటివిటీ ఏర్పడడానికి ప్రధాన కారణం వార్డ్ వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థే. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 5 లక్షల మంది వాలంటీర్లు సక్రమంగా వారి వారి బాధ్యతలను నిర్వర్తించడం మూలంగానే ఇప్పుడు ఇంతటి సక్సెస్ జగన్ సాధించగలిగాడు. అయితే వాలంటీర్ల సేవకు మెచ్చిన జగన్ ప్రతి సంవత్సరం వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తున్నారు, అందులో భాగంగా ఈ సంవత్సరం సైతం వారికి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా ఉత్తమ సేవలను అందించిన వారిని ఎంపిక చేసి నగదు బహుమతులను ఇస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా వాలంటీర్ల లిస్ట్ ను రెడీ చేసింది ప్రభుత్వం.

కాగా ఈ బహుమతులు కేవలం ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫిర్యాదులు లేని వారికి మాత్రమే ఇవ్వనున్నారు. ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి. సేవావజ్ర కింద రూ. 30 వేలు, సేవ రత్న కింద రూ. 20 వేలు మరియు సేవామిత్ర కింద రూ. 10 వేలు అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news