ఇంకా 30 ఏళ్లు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలి – సీఎం జగన్

-

రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్‌ ‌సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మీతోడు జగన్‌కు కావాలని.. మనం అంతా ఇంకా 30 సంవత్సరాలు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలని కార్యకర్తలతో పేర్కొన్నారు. జీవితం కాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలని వెల్లడించారు.

ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారని.. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన కార్యకర్తలను కలుస్తున్నానని స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా రాజాం నియోజకవర్గం కార్యకర్తలనూ కలుస్తున్నానని.. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించండన్నారు.

వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని.. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింతపెరగాలని.. రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే రూ.775 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామని.. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం నిలబెట్టుకున్నామన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news