గుడ్ న్యూస్ : వైయస్సార్‌ బీమాలో మార్పులు… ఇక నెల రోజుల్లోనే పరిహారం

-

వైఎస్సార్ బీమాపై ఇవాళ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో ఈ సందర్బంగా మార్పులు చేశారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తిచెప్పాలని నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఇక మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనుంది. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం అందిస్తుండగా.. సంపాదించే వ్యక్తి,18- 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5లక్షల ఆర్థిక సహాయం అందించనుంది జగన్ సర్కార్.

జులై 1 నుంచి కొత్త మార్పులతో వైయస్సార్‌ బీమా అమలు చేయాలని తాజాగా సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిములను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
జులై 1లోగా ఈ క్లెములన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. రైతుల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీ కూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news